ఇలా చేస్తే ఎలా అంటూ '2.0' టీమ్ పై ఇతర నిర్మాతల అసహనం!

  • శంకర్ తాజా చిత్రంగా '2.0'
  • ప్రధాన పాత్రధారులుగా రజనీ, అక్షయ్ 
  • విడుదల తేదీపై అయోమయం 
  • క్లారిటీ ఇవ్వని దర్శక నిర్మాతలు  
రజనీకాంత్ .. శంకర్ కాంబినేషన్ కి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ సారి ఈ కాంబినేషన్ కి అక్షయ్ కుమార్ ఇమేజ్ .. అమీ జాక్సన్ గ్లామర్ కూడా తోడైంది. ఫలితంగా '2.0'పై ఒక రేంజ్ లో అంచనాలు వున్నాయి. ముందుగా ఈ సినిమాను దీపావళికి విడుదల చేయనున్నట్టు చెప్పారు. ఆ తరువాత ఆ నిర్ణయాన్ని మార్చుకుని, జనవరి 25న విడుదల చేయనున్నామని ప్రకటించారు.

 అభిమానులంతా ఆ రోజు కోసం ఆత్రుతగా ఎదురుచూస్తుండగా, ఆ రోజున కూడా ఈ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే టాక్ వినిపిస్తోంది. తమిళ సంవత్సరాది సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రాలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా రిలీజ్ ను బట్టి తమ సినిమాల విడుదలను ప్లాన్ చేసుకోవాలనుకున్న నిర్మాతలు, తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. తమని అయోమయానికి గురిచేయకుండా అసలు తేదీని ఎనౌన్స్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారనేది కోలీవుడ్ టాక్.             
Go Back to Shorts
rajanikanth
amy jockson

More Telugu News